Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మదుమలై ఫారెస్ట్‌లోని ఏనుగులకు సోకిన కరోనా?

మదుమలై ఫారెస్ట్‌లోని ఏనుగులకు సోకిన కరోనా?
, బుధవారం, 9 జూన్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకవైపు శాంతిస్తోంది. మరోవైపు, వన్యమృగాలకు ఎక్కువగా సోకుతుంది. ఇప్పటికే చెన్నై వండలూరు జూలోని సింహాలకు ఈ వైరస్ సోకింది. ఇందులో నిలా అనే ఆడ సింహం చనిపోగా, మరో సింహాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మదుమలై అటవీ ప్రాంతంలోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో ఉన్న గజరాజులకు ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఏకంగా 28 ఏనుగులకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇజ్జత్ నగ‌ర్‌లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.
 
ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 26 పెద్ద ఏనుగులు కాగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయన్నారు. 
 
మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని, ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు జేసీబీ తర్వాత బ్రిడ్జిని ఢీకొట్టిన మినీ బస్సు - 17 మంది మృత్యవాత