Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందు జేసీబీ తర్వాత బ్రిడ్జిని ఢీకొట్టిన మినీ బస్సు - 17 మంది మృత్యవాత

ముందు జేసీబీ తర్వాత బ్రిడ్జిని ఢీకొట్టిన మినీ బస్సు - 17 మంది మృత్యవాత
, బుధవారం, 9 జూన్ 2021 (08:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి ముందు జేసీబీని ఢీకొట్టింది. ఆ తర్వాత వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా మరో 24 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం రాత్రి కాన్పూర్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
యూపీ రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జేసీబీని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది. 
 
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలోనే పలువురు మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 
 
మరోవైపు, ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్.. సాయంత్రం 6 గంటల నుంచి..?