Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోల్డ్ షాకింగ్ న్యూస్ : పరుగులు పెడుతున్న పసిడి ధరలు...

గోల్డ్ షాకింగ్ న్యూస్ : పరుగులు పెడుతున్న పసిడి ధరలు...
, శుక్రవారం, 4 జూన్ 2021 (10:31 IST)
దేశంలో కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరల పెరుగుదలకు ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. వీటి ధరలు రోజురోజకూ పెరిగిపోతున్నాయి. గత రెండు నెలల కిందట కింది చూపులు చూసిన బంగారం.. ఇప్పుడు పై చూపులు చూస్తోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. 
 
తాజాగా దేశీయంగా పరిశీలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంటే 10 గ్రాములపై 100 రూపాయలు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో నిలకడగా ఉంది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,350 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790 వద్ద ఉంది. 
 
ఇకపోతే, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,230 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది.
 
ఈ ధరల పెరుగుదలపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వేలో 3378 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. చెన్నై పెరంబూరులో..