Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా చార్జీల మోత తప్పదు.. సంకేతాలు పంపిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:30 IST)
దేశంలో మున్ముందు డేటా చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సంకేతాలు పంపించింది. అమెరికా తరహాలో అధిక ధరలను వసూలు చేయబోమని, అలాగని అతి తక్కువ ధరకు డేటాను ఇవ్వలేమని స్పష్టం చేసింది. అందువల్ల వచ్చే ఆర్నెలల్లో డేటా చార్జీల మోత తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం డేటా చార్జీలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని, రూ.160కే నెలకు 16జీబీ డేటా వినియోగం విషాదకరమన్నారు. 'వినియోగదారులు ఇదే రేటుతో నెలకు 1.6 జీబీ వినియోగంతో సరిపెట్టుకోవడం లేదంటే అధిక రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 
 
పైగా, అమెరికా, యూరప్‌ తరహాలో నెలకు 50-60 డాలర్లు వసూలు చేయాలనుకోవడం లేదు. కానీ, 2 డాలర్ల కంటే తక్కువ రేటుకే 16జీబీ డేటా అందించలేమని ఆయన తెలిపారు.
 
డిజిటల్‌ కంటెంట్‌ వినియోగం పెరుగుతుండటంతో వచ్చే ఆరు నెలల్లో ఒక్కో వినియోగదారు నుంచి ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 దాటొచ్చని మిట్టల్‌ అన్నారు. ఎయిర్‌టెల్‌తో పాటు మిగతా కంపెనీలు చివరిసారిగా 2019 డిసెంబరులో చార్జీలు పెంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments