Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా చార్జీల మోత తప్పదు.. సంకేతాలు పంపిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (12:30 IST)
దేశంలో మున్ముందు డేటా చార్జీలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సంకేతాలు పంపించింది. అమెరికా తరహాలో అధిక ధరలను వసూలు చేయబోమని, అలాగని అతి తక్కువ ధరకు డేటాను ఇవ్వలేమని స్పష్టం చేసింది. అందువల్ల వచ్చే ఆర్నెలల్లో డేటా చార్జీల మోత తప్పదని ఆ సంస్థ ఛైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం డేటా చార్జీలు చాలా కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని, రూ.160కే నెలకు 16జీబీ డేటా వినియోగం విషాదకరమన్నారు. 'వినియోగదారులు ఇదే రేటుతో నెలకు 1.6 జీబీ వినియోగంతో సరిపెట్టుకోవడం లేదంటే అధిక రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 
 
పైగా, అమెరికా, యూరప్‌ తరహాలో నెలకు 50-60 డాలర్లు వసూలు చేయాలనుకోవడం లేదు. కానీ, 2 డాలర్ల కంటే తక్కువ రేటుకే 16జీబీ డేటా అందించలేమని ఆయన తెలిపారు.
 
డిజిటల్‌ కంటెంట్‌ వినియోగం పెరుగుతుండటంతో వచ్చే ఆరు నెలల్లో ఒక్కో వినియోగదారు నుంచి ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 దాటొచ్చని మిట్టల్‌ అన్నారు. ఎయిర్‌టెల్‌తో పాటు మిగతా కంపెనీలు చివరిసారిగా 2019 డిసెంబరులో చార్జీలు పెంచిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments