Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 14వ సీజన్ : ఆటగాళ్ళ వేలం పాటలు హోరు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (14:15 IST)
దేశంలో మరో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. మార్చి నెలాఖరు లేదు ఏప్రిల్ నెల మొదటివారంలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సీజన్‌కు ముందే అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాలను జనవరిలో విడుదల చేశాయి. 
 
అలాగే గతవారం ట్రేడింగ్‌ విండో కూడా ముగిసింది. ఇక మిగిలింది వేలం పాటే. అది కూడా గురువారం మధ్యాహ్నం నుంచి మొదలైంది. దీంతో 2021 సీజన్‌కు ఆయా ఫ్రాంఛైజీలు కొత్తగా ఎవరెవరిని కొనుగోలు చేస్తున్నాయనే అంశంపై ఆసక్తి మొదలైంది. 
 
ఈ వేలంలో పాల్గొనడానికి మొత్తం 1,144 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా, అందులో 292 మందిని ఎంపిక చేశారు. వారిలోనూ 164 మంది భారత ఆటగాళ్లకు, 125 విదేశీ ఆటగాళ్లకు, మరో ముగ్గురు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. 
 
ఇక ఈ 292 మంది క్రికెటర్లలో 61 మందినే వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అత్యధికంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 11 మందిని తీసుకొనే అవకాశం ఉంది. తర్వాత అత్యధిక ఖాళీలున్న జట్లు పంజాబ్‌, రాజస్థాన్‌. ఈ రెండు జట్లు ఇంకా 9 మంది చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంది.
 
ఇక ముంబై ఇండియన్స్‌ ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరుగురు ఆటగాళ్లను తీసుకొనే వీలుంది. చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేవలం ముగ్గుర్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జట్టులో ఇప్పటికే 22 మంది ఆటగాళ్లున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments