Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 101 మంది మృతి

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. 101 మంది మృతి
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:23 IST)
భారత్‌లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,881 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 11,987 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కు చేరింది.
 
గడచిన 24 గంటల సమయంలో 101 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,014కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,56,845 మంది కోలుకున్నారు. 1,37,342 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
ఇప్పటివరకు 94,22,228 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,87,03,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,26,562 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈసారి లేపేస్తాం : మలాలాకు ఎక్కువైన బెదిరింపులు