ఐపీఎల్ సీజన్ 14 : సీఎస్కే జట్టులో కరోనా కలకలం.. ముగ్గురికి పాజిటివ్

Webdunia
సోమవారం, 3 మే 2021 (15:27 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై జట్టులో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బంది, ఫ్రాంఛైజీ అధికారులు, ఇతరులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో ముగ్గురికి పాజిటవ్‌గా నిర్ధారణ అయింది. 
 
చెన్నై టీమ్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిసింది. వైరస్‌ బారినపడిన వారిలో ఆటగాళ్లు ఎవరూ లేరని సమాచారం. 
 
చెన్నై టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఒక బస్‌ క్లీనర్‌లకు వైరస్‌ సోకినట్లు తెలిసింది.  నాన్ ‌- ప్లేయింగ్‌ మెంబర్స్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఫ్రాంఛైజీ అప్రమత్తమైంది. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు చెందిన వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌ల‌కు క‌రోనా సోకింది. దీంతో సోమ‌వారం రాత్రి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంపతుల మధ్య గొడవ.. రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో పడేసిన తల్లి

పవన్ కల్యాణ్ గ్రామస్వరాజ్యం సత్తా, నా ఓటు వేస్ట్ కాలేదంటున్న నెటిజన్ వీడియో

Operation Octopus: డిజిటల్ మోసాలపై తెలంగాణ బ్రహ్మాస్త్రం.. ఆపరేషన్ ఆక్టోపస్ రెడీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. కారణం అదే..

భర్తను బ్రతికించుకునేందుకు భార్య రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్, విమానం కూలింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Mokshagna: ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ

విజయ్- రష్మిక వివాహ వేడుక.. మెహందీ నుంచి క్రికెట్ మ్యాచ్ వరకు వివరాలివే..

మేము ప్రతీది కలిసి పని చేస్తాం.. విడాకుల తర్వాత రాజ్ దొరకడం అదృష్టం: సమంత

రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు ప్రారంభం.. ఇన్‌స్టాలో ఫోటోలు

MAA Dairy: మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన భట్టి విక్రమార్క మల్లు

తర్వాతి కథనం
Show comments