Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020కి దూరమైన సురేష్ రైనా... దుబాయ్‌ నుంచి భారత్‌కు.. కారణం ఏంటి?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (13:13 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నుంచి సురేష్ రైనా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2020లో ఆడేది లేదని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు సురేష్ రైనా ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ సీజన్‌కి దూరమవుతున్నాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించింది. ఆయన దుబాయి నుంచి భారత్‌కు వెనక్కి వచ్చేశారని తెలిపింది.
 
కానీ సురేష్ రైనా ఐపీఎల్ 2020 నుంచి ఏ కారణం వల్ల తప్పుకోవాల్సి వచ్చిందనే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి వుంది. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెన్నై సూపర్‌ కింగ్స్ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్ పేర్కొంది. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడడానికి ఇప్పటికే జట్లు దుబాయికి చేరుకున్నాయి. కాగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో కొంతమందికి కరోనా సోకిందని వచ్చిన వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా దుబాయి నుంచి తిరిగి వస్తుండటం గమనార్హం. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సీఎస్కే తలపడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments