Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ సందడి : క్రికెట్ ప్రియుల కోసం జియో నయా ప్లాన్స్

ఐపీఎల్ సందడి : క్రికెట్ ప్రియుల కోసం జియో నయా ప్లాన్స్
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:33 IST)
వచ్చే నెలలో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఐపీఎల్ జట్లు ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్నాయి. అయితే, ఈ ఐపీఎల 2020ని పురస్కరించుకుని రిలయన్స్ జియో రెండు సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది.
 
జియో క్రికెట్ ప్లాన్స్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ప్లాన్స్ విలువ రూ.499, రూ.777గా ఉండనుంది. ఈ ప్లాన్లలో 399 రూపాయల విలువైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత చందాను ఒక యేడాది పాటు అందివ్వనుంది. 
 
తద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మైజియో యాప్ ద్వారా ఈ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. 
 
కాగా, రూ.499 క్రికెట్ ప్లాన్ ప్రకారం ఐపీఎల్ సీజన్ మొత్తం రోజుకు 1.5 హై స్పీడ్ డేటాతో 56 రోజులు పాటు అందిస్తుంది. వీటితో పాటు.. డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ చందా ఏడాది ఉచితం. అయితే, ఈ ప్లాన్ కింద ఎలాంటి ఫోన్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉండదు. 
 
ఇకపోతే రూ.777 క్రికెట్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ కింద, 5 జీబీ అదనపు డేటాతో 1.5 జీబీ రోజువారీ హైస్పీడ్ డేటా, అపరిమిత జియో టూ జియో కాలింగ్, ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 3,000 ఎఫ్‌యుపి నిమిషాలు రోజుకు 100 కాంప్లిమెంటరీ ఎస్‌ఎంఎస్‌లు పంపించుకునే వెసులుబాటు ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉస్సేన్ బోల్ట్‌కు కరోనా.. బర్త్ డే పార్టీ కెళ్లిన వారిలో వణుకు..