Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తర్వాత ఫ్యాన్స్‌కి పండగే.. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ తప్పక వుంటుందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఊహించని విధంగా ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత జట్టుకు ప్రపంచ కప్ సాధించి పెట్టిన ధోనీకి వీడ్కోలు మ్యాచ్ లేకపోవడం ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. టీమిండియా ఖాతాలో అనేక రికార్డులు సాధించేలా చేసిన ధోనీ ఇలా ఏ మ్యాచ్‌ లేకుండా వీడ్కోలు పలకడం సబబు కాదని ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిన కెప్టెన్ కేవలం ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలకడం సరికాదని.. ధోనీకి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చాలామంది బీసీసీఐని కోరారు. ఇక ఇపుడు బీసీసీఐ కూడా అదే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాత ఆడే అంతర్జాతీయ సిరీస్ లో ధోనిని ఆడించాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... భారత జట్టుకు ప్రస్తుతం ఎటువంటి అంతర్జాతీయ సిరీస్‌లు లేవు. కాబట్టి ఐపీఎల్ తర్వాత ధోనికి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చూస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే.. భారత జట్టుకు ధోని చాలా సేవ చేసాడు. 
 
కాబట్టి అతనికి చివరి మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. కానీ ధోని ఏం ఆలోచిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరు అనుకోని సమయంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఐపీఎల్ తర్వాత అతను ఆడాల్సిన మ్యాచ్ లేదా సిరీస్‌పై చర్చిస్తాము. ఇక అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరి మ్యాచ్ నిర్వహించి అతడిని సత్కరిస్తాం'' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూట్యూబర్ ముసుగులో శత్రుదేశానికి రహస్యాలు చేరవేత.. వ్యక్తి అరెస్టు

Baba Vanga భారతదేశంలో అలాంటివి జరుగుతాయంటున్న బాబా వంగా భవిష్యవాణి 2026

Children: దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి.. ఎక్కడో తెలుసా?

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

తర్వాతి కథనం
Show comments