Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తర్వాత ఫ్యాన్స్‌కి పండగే.. ధోనీకి వీడ్కోలు మ్యాచ్ తప్పక వుంటుందా?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఊహించని విధంగా ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత జట్టుకు ప్రపంచ కప్ సాధించి పెట్టిన ధోనీకి వీడ్కోలు మ్యాచ్ లేకపోవడం ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. టీమిండియా ఖాతాలో అనేక రికార్డులు సాధించేలా చేసిన ధోనీ ఇలా ఏ మ్యాచ్‌ లేకుండా వీడ్కోలు పలకడం సబబు కాదని ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిన కెప్టెన్ కేవలం ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్రికెట్‌కు వీడ్కోలు పలకడం సరికాదని.. ధోనీకి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చాలామంది బీసీసీఐని కోరారు. ఇక ఇపుడు బీసీసీఐ కూడా అదే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ తర్వాత ఆడే అంతర్జాతీయ సిరీస్ లో ధోనిని ఆడించాలనుకుంటున్నట్లు సమాచారం. 
 
ఇదే విషయంపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... భారత జట్టుకు ప్రస్తుతం ఎటువంటి అంతర్జాతీయ సిరీస్‌లు లేవు. కాబట్టి ఐపీఎల్ తర్వాత ధోనికి ఓ వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని చూస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే.. భారత జట్టుకు ధోని చాలా సేవ చేసాడు. 
 
కాబట్టి అతనికి చివరి మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. కానీ ధోని ఏం ఆలోచిస్తాడో ఎవరికి తెలియదు. ఎవరు అనుకోని సమయంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఐపీఎల్ తర్వాత అతను ఆడాల్సిన మ్యాచ్ లేదా సిరీస్‌పై చర్చిస్తాము. ఇక అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరి మ్యాచ్ నిర్వహించి అతడిని సత్కరిస్తాం'' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments