Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్ క్యూరేటర్ కస్తూరి రంగన్ ఇకలేరు...

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (09:09 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్, పిచ్ క్యూరేటర్‌గా పని చేసిన గోపాలస్వామి కస్తూరి రంగన్ ఇకలేరు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో కర్నాటక రాష్ట్రంలోని చామరాజపేటలో ఉన్న తన నివాసంలోనే కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. 
 
ఈ విషయాన్ని కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, అధికార ప్రతినిధి వినయా మృత్యుంజయ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. మైసూరు రాష్ట్రానికి చెందిన ఆయన... ఆ రాష్ట్రం తరపునే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మైసూర్ తరపున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 94 వికెట్లు తీశారు.
 
1952లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా భారత జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. కర్ణాటక జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన కస్తూరి రంగన్ కర్ణాటక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలందించారు. కస్తూరిరంగన్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments