Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్ క్యూరేటర్ కస్తూరి రంగన్ ఇకలేరు...

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (09:09 IST)
భారత క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్, పిచ్ క్యూరేటర్‌గా పని చేసిన గోపాలస్వామి కస్తూరి రంగన్ ఇకలేరు. ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు గుండెపోటు రావడంతో కర్నాటక రాష్ట్రంలోని చామరాజపేటలో ఉన్న తన నివాసంలోనే కన్నుమూశారు. ఆయన వయసు 89 యేళ్లు. 
 
ఈ విషయాన్ని కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి, అధికార ప్రతినిధి వినయా మృత్యుంజయ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. మైసూరు రాష్ట్రానికి చెందిన ఆయన... ఆ రాష్ట్రం తరపునే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఫాస్ట్ బౌలర్ అయిన ఆయన మైసూర్ తరపున 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 94 వికెట్లు తీశారు.
 
1952లో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా భారత జాతీయ జట్టుకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లలేకపోయారు. కర్ణాటక జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన కస్తూరి రంగన్ కర్ణాటక క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ క్యురేటర్‌గా, బోర్డు అధికార ప్రతినిధిగా సేవలందించారు. కస్తూరిరంగన్ మృతికి టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విచారం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments