Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఘోర తప్పిదం చేసింది : రికీ పాంటింగ్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:55 IST)
ఐసీసీ ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన భారత క్రికెట్ జట్టులో యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయక పోవడం ఘోర తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. 
 
సోమవారం రాజస్థాన్‌ రాయల్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ (36 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 78 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. అజింక్య రహానే 63 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (నాటౌట్‌) పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్‌ స్మిత్‌ 32 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. ధావన్‌ 27 బంతుల్లో ఎనిమిది  ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 54 ఇన్నింగ్స్‌ ధాటిగా ఆరంభించగా.. రిషభ్‌ పంత్‌ మెరుపులతో కొండంత లక్ష్యం చిన్నబోయింది.
 
ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, రిషబ్ ఆటతీరుపై ప్రశంసల జల్లు కురపించాడు. పంత్‌ను జట్టులోకి తీసుకోకుండా భారత్‌ ఘోర తప్పిదం చేసిందని చెప్పాడు. పంత్‌ ఇంగ్లీష్‌ కండిషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకునేవాడని చెప్పాడు. 
 
ముఖ్యంగా మిడిల్‌ ఓవర్స్‌లో స్పిన్నర్లను ఓ ఆట ఆడుకునేవాడు. అతన్ని ఎంపిక చేయనప్పుడే చెప్పా.. పంత్‌కు మూడు నాలుగు ప్రపంచకప్‌లు ఆడే సత్తా ఉందని, మళ్లీ చెబుతున్నా.. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటే పంత్‌కు ఆట విషయంలో తిరుగులేదని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments