ఉప్పల్‌లో క్రికెట్ పండుగ : హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:22 IST)
ఐపీఎల్ 2019 11వ సీజన్‌లో భాగంగా ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుంది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకారం మే 12వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. దీనికి కారణం... చిదంబరం స్టేడియంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూసివున్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. దీంతో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే తమ సొంత మైదానంలోనే ఈ మ్యాచ్‌ ఆడవచ్చు. ఇక మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్‌, 10వ తేదీన జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. నిజానికి ఈ రెండు కూడా హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. కానీ 6, 8, 10వ తేదీల్లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో మ్యాచ్‌లకు పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు అప్పులు తీసిచ్చి.. వారు తిరిగి చెల్లించకపోవడంతో డాక్టర్ ఆత్మహత్య.. ఎక్కడ?

Cyclone montha: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు.. మంచిరేవుల గ్రామ రోడ్డు మూసివేత

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పారశాఠల్లో అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

మద్యం షాపులో జగడం.. మధ్యవర్తిగా వచ్చినోడు ఏం చేశాడంటే?

Cyclone montha: తెలంగాణలో భారీ వర్షాలు.. రాబోయే 24 గంటల్లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments