Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్‌లో క్రికెట్ పండుగ : హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:22 IST)
ఐపీఎల్ 2019 11వ సీజన్‌లో భాగంగా ఫైనల్ పోటీలు హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనుంది. ముందుగా ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌ ప్రకారం మే 12వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానానికి తరలించారు. దీనికి కారణం... చిదంబరం స్టేడియంలో హైకోర్టు ఆదేశాల మేరకు మూసివున్న మూడు స్టాండ్స్‌ను తెరిపించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావడంలో తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) విఫలమైంది. దీంతో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అయితే క్వాలిఫయర్‌ -1 మాత్రం చెన్నైలోనే జరుగుతుంది. దీంతో సీఎస్‌కే టాప్‌-2లో నిలిస్తే తమ సొంత మైదానంలోనే ఈ మ్యాచ్‌ ఆడవచ్చు. ఇక మే 8వ తేదీన జరిగే ఎలిమినేటర్‌, 10వ తేదీన జరిగే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లను విశాఖపట్నానికి తరలించారు. నిజానికి ఈ రెండు కూడా హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. కానీ 6, 8, 10వ తేదీల్లో తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో మ్యాచ్‌లకు పోలీసు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments