Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ

ఐపీఎల్‌లో రికార్డుల పంట పండిస్తున్న చెన్నై కింగ్స్ కెప్టెన్ ధోనీ
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (10:45 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల పంట పండిస్తున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చివరి వరకు పోరాడింది. అయితే కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 
 
ఈ మ్యాచ్‌లో ధోనీ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 84 పరుగులు సాధించాడు. టీ-20 ఫార్మెట్‌లో ధోనీకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తద్వారా ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డు సృష్టించాడు. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఏడు సిక్సర్లు బాదాడు. ధోనీ ఐపీఎల్‌లో మొత్తం 203 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ధోనీ (203 సిక్సర్లు) మూడో స్థానంలో నిలిచాడు. 
 
ధోనీ కంటే ముందు క్రిస్ గేల్(323 సిక్సర్లు), ఏబీ డీ విల్లియర్స్(204) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గానూ ధోనీ రికార్డు సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తులో 'ఆ' పని చేసిన అమ్మాయి.. వీడియో వైరల్