Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ కూల్‌కు కోపమొచ్చింది.. ధోనీపై 50శాతం మ్యాచ్ ఫీజు కోత..

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:29 IST)
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై 50 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించారు. ధోనీ ఐపీఎల్ కోడ్‌ను ఉల్లంఘించారు. అవును మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని ఎప్పుడూ ప్రశాంతంగా వుండే ధోనీకి ఈ సారి కోపం వచ్చింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన లెవల్ 2 నేరం చేశాడు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్‌కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్‌ను తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకున్నారు. ఇదే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. 
 
ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు. 
 
మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకుని, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ధోనీకి కోపం వచ్చింది. కానీ దీన్ని ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2వ స్థాయి నేరంగా పరిగణిస్తూ, మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాను నిర్వాహకులు విధించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments