Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై విజయాలకు బ్రేక్.. బట్లర్ అదుర్స్.. రంగు మార్చిన రాజస్థాన్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్య

Webdunia
శనివారం, 12 మే 2018 (09:22 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రాజస్థాన్ చుక్కలు చూపించింది. ఈ క్రమంలో శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. 
 
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై వరుస విజయాలకు రహానే సేన బ్రేక్ వేసింది. ఇంకా ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కోసం పింక్ సిటీలో జరిగిన ఈ మ్యాచ్‌లో పింక్ జెర్సీతో బరిలోకి దిగిన రాజస్థాన్.. రంగుమార్చి విజయం అందుకుంది.
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లలో ఓపెనర్ షేన్ వాట్సన్ 39, అంబటి రాయుడు 12, కెప్టెన్ ధోనీ 33, శామ్ బిల్లింగ్స్ 27 పరుగులు చేయగా, సురేశ్ రైనా 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) సాధించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధీ ఓ వికెట్ నేలకూల్చాడు.
 
అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ విజృంభిచాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 95 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 19వ ఓవర్ వేసిన డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ రెండు సిక్సర్లు బాదడంతో విజయం రాజస్థాన్ వైపు మళ్లినా చివరి బంతికి అతడు అవుటవడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
 
చివరి ఓవర్లో మూడు బంతులకు 10 పరుగులు చేయాల్సిన తరుణంలో బ్రావో వేసిన మూడో బంతికి రెండు పరుగులు సాధించిన బట్లర్ తర్వాతి బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు రావడంతో జట్టుకు విజయం సాధించిపెట్టాడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించిన బట్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments