Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌ 11: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ఐపీఎల్‌ 11లో భాగంగా జైపూర్‌‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓడించింది. తద్వారా ఈ మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో

ఐపీఎల్‌ 11: రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (12:09 IST)
ఐపీఎల్‌ 11లో భాగంగా జైపూర్‌‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టును కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓడించింది. తద్వారా ఈ మైదానంలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచిన రాజస్థాన్‌కు కేకేఆర్ జట్టు బ్రేక్ వేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు ఓవర్లలో నిలకడగా ఆడింది. 
 
నాలుగో ఓవర్‌లో రహానే రెచ్చిపోయి వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. దీంతో స్కోరు బోర్డు ఉరుకులేసింది. కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్, రహానే (36)ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత షార్ట్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. సంజూ శామ్సన్‌ (7), రాహుల్ త్రిపాఠి (15), బెన్ స్టోక్స్‌ (14) రాణించకపోగా, దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
 
అనంతరం, బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో రాబిన్‌ ఉతప్ప (48), సునీల్ నరైన్‌ (35‌), దినేష్ కార్తీక్ (42), నితీశ్ రాణా (35) రాణించడంతో కోల్‌కతా 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన నితీశ్ రాణా ''మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'' గా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లో సిక్సర్ల మొనగాడు ఎవరు?