Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లన్నీ పూణెలో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనా

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (11:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా, చెన్నైలో జరిగే మ్యాచ్‌లను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ను కట్టుదిట్టమైన భద్రతనడుమ నిర్వహించారు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఆందోళనకారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఈ మైదానంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను మరోచోటికి తరలించారు.
 
నిజానికి సీఎస్కే జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల కోసం నాలుగు నగరాల పేర్లను చెన్నై టీమ్ ముందు ఉంచినట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. వీటిలో ఏపీలోని విశాఖపట్నంతోపాటు త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్ ఉన్నాయి. అయితే వీటిలోనూ పుణెను ఎంపిక చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

తర్వాతి కథనం
Show comments