Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో కావేరి రచ్చ : ఐపీఎల్ మ్యాచ్‌ల వేదిక మార్పు?

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు, రైతులు, వ్యవసాయదారులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు.

చెన్నైలో కావేరి రచ్చ : ఐపీఎల్ మ్యాచ్‌ల వేదిక మార్పు?
, బుధవారం, 11 ఏప్రియల్ 2018 (17:12 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కావేరీ నిర్వహణ మండలి ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు, రైతులు, వ్యవసాయదారులు కూడా ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. 
 
దీంతో ఈనె 10వ తేదీన చెన్నై సూపర్ కింగ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ నిర్వహణకు పెద్ద సాహసమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈనెల 20వ తేదీన చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌కు నామ్ తమిళర్ కట్చి నేతలు నిర్వాహకులను హెచ్చరించారు. కావేరీ జలాలా వివాదం నేపథ్యంలో వాళ్లు ఈ హెచ్చరికలు జారీ చేశారు. 
 
బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నామ్ తమిళర్ కట్చి నేత సీమన్ మాట్లాడుతూ 'రేపు నిరసన చేస్తాం. ఏప్రిల్ 20న మ్యాచ్ జరుగదు' అని ప్రకటించారు. అనంతరం సినీ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ.. 'మా నిరసనలు చెన్నైలో మ్యాచ్‌ జరిగే ప్రతి రోజూ జరుగుతాయి. ముందు ముందు ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారుతాయి' అని తెలిపారు. ఏప్రిల్ 20న చిదంబం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌తో పాటు.. మిగిలిన మ్యాచ్‌ల వేదికను మరో ప్రాంతానికి తరలించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బీబీసీ రిపోర్టర్ (Video)