Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఫ్లైట్ టార్గెట్.. యెమెన్‌లో బాంబు పేలుడు.. 22మంది మృతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (09:59 IST)
యెమన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు బాంబు దాడులు చేశారు. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రధానికి, మంత్రి వర్గానికి స్వగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో సమీపంలోనే దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు 22 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని, మంత్రి వర్గాన్ని సురక్షితంగా అక్కడినుంచి తప్పించారు. 
 
ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధాని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటుగా అనేక దేశాలు ఖండించాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments