Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలో అత్యంత మురికి వ్యక్తి మృతి... ఇపుడు ఆ రికార్డు భారత్ సొంతం...

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:12 IST)
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా రికార్డు సాధించిన ఇరాన్ దేశస్థుడు అమౌ హాజీ ఇకలేరు. 94 యేళ్ళ వయస్సులో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుడా హాయిగా ప్రాణాలు విడిచాడు. దాదాపు 60 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. అయితే, ఆయన నివసించే గ్రామ ప్రజలు బలవంతంగా ఇటీవల ఆయనకు స్నానం చేయించారు. ఈ స్నానం చేయించిన కొద్ది రోజులకే ఆయన చనిపోవడం గమనార్హం. 
 
అమౌ హాజీ మృతితో ఇపుడు ఈ రికార్డు భారత్ సొంతమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కైలాశ్ కాలౌ సింగ్ (63) గత 44 యేళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని గత 2009లోనే హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్‌లోని డెగ్జా గ్రామంలో మృతి చెందారు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్థులే దయతలచి తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. 
 
చనిపోయిన మూగ జీవాల మాంసాన్ని ఆరగిస్తూ జీవిస్తూ వచ్చాడు. ఒకేసారి నాలుగైదు సిగరెట్లు ఊదిపడేసేవాడు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారినపడుతామన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన.. సబ్బుతో ముఖం, కాళ్లు చేతులూ ఎన్నడూ కడుక్కోకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments