Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పండు ధర రూ.70 వేల రూపాయలా??

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (16:12 IST)
సాధారణంగా మనం కుళ్లిపోయిన వాసన వస్తేనే, అలాంటి వస్తువులను ముట్టుకోము. అలాంటిది మురికి కాలువ, చెమట పట్టిన సాక్స్ వాసన వచ్చే పండుని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? భూమిపై ఇలాంటి పండు కూడా ఉంటుందని మీకు తెలుసా. ఈ పండు ఖరీదు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ పండు ఖరీదు అక్షరాల డెబ్బై వేలు. అవును మీరు వింటున్నది నిజమేనండి బాబూ. ఈ పండు ధర రూ.71,141 (1000 డాలర్లు). 
 
ఈ పండులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఇది చాలా అరుదుగా లభించే పండు. ఆగ్నేసియాలో లభించే ఈ పండు పేరు డురియన్. జే-క్వీన్ హైబ్రిడ్ రకానికి చెందిన ఈ పండును ఇండోనేషియా ప్రజలు పండ్లలో రారాజుగా భావిస్తారు. ఈ పండు గుండ్రటి ఆకారంలో ఉంటూ.. చాలా అరుదుగా లభించడం వల్ల వీటి ధర అంత ఉంటుంది.
 
ఈ పండ్లు నుంచి వచ్చే దుర్వాసన కారణంగా సింగపూర్‌లోని కొన్ని హోటళ్లు వీటిని నిషేధించారు. ఈ పండు 1000 డాలర్లకు అమ్ముడవుతుండడం వల్ల ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments