Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... ప్రియుడిని చంపేసి ముక్కలు చేసి ఉడికించేసింది...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:20 IST)
ఒక మహిళ తన ప్రియుడిని చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించేసింది. అయితే ఈ సంఘటన మన దేశంలో కాదు దుబాయ్‌లో జరిగింది.
 
మొరాకోకు చెందిన 37 ఏళ్ల మహిళకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారితో విడిపోయిన మహిళ పదేళ్ల నుండి దుబాయ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో మొరాకోకే చెందిన 29 ఏళ్ల వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. ఈ పరిచయం ప్రేమగా మారి వారు సహజీవనం చేసుకునే వరకు వెళ్లింది.
 
ఇటీవలే ఆ వ్యక్తికి ఆ మహిళకు వివాహమైందన్న విషయం తెలిసింది. అప్పటి నుండి తరచూ వీరిమధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. హఠాత్తుగా ఒక రోజు ఆ మహిళ అతనిని చంపేసి, శవాన్ని ఏమి చెయ్యాలో తెలీక ముక్కలు ముక్కలుగా కోసింది. అయితే అప్పటికే ఇరుగుపొరుగు వారికి దుర్వాసన వచ్చి అడుగగా ఎండుచేపలు కొన్నానని, అవి పాడైపోయాయని చెప్పింది. ఆ తర్వాత ఆ మాంసాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించింది. రెండురోజులు దాటినా కూడా దుర్వాసన తగ్గకపోవడంతో పక్కింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటిని సోదా చేయగా ఉడకబెట్టిన మనిషి మాంసం కనిపించింది. ఆ ఇంటిలో వాసన భరించలేక పోలీసులు చాలా కష్టపడ్డారు. అయితే ఆ మహిళ మాత్రం అక్కడ ఏమీ దుర్వాసన లేనట్లు చాలా సాధారణంగా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments