Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా గాంధీ రోడ్ షో... సెల్ ఫోన్ దొంగలు వీరవిహారం...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:12 IST)
ప్రియాంక గాంధీ రాకతో నూతన సమరోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రియాంకగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. నిన్న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రియాంక గాంధీ రోడ్ షోలో పాల్గొంది. లక్నో విమానాశ్రయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించగా అందులో పాల్గొన్న అనేక మంది ఫోన్‌లు దొంగిలించబడ్డాయి. దాదాపు 50 మందికి పైగా ఫోన్‌లు తస్కరించబడ్డాయి. 
 
రోడ్‌షోకి ఎక్కువ మంది గుమిగూడటం వల్ల దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకుల ఫోన్‌లు సైతం చోరీకి గురైయ్యాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీషాన్ హైదర్‌ ఫోన్ కూడా దొంగిలించబడడం కొసమెరుపు. దాదాపుగా యాభై మంది నుండి ఫోన్‌లు చోరీకి గురైయ్యాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు. చోరీ అయిన ఫోన్‌లను రికవర్ చేసుకోవడానికి సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం