Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మనిషినే.. భర్త మ*** కోసి కుక్కకు విసిరేసిన భార్య..!

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (14:49 IST)
భర్తను చంపడమే కాకుండా అతని మర్మాంగాన్ని కోసి కుక్కకు వేసిన ఘటన ఉక్రెయిన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌కు చెందిన ఒబారివ్ అనే గ్రామంలో ఒలెంగ్జాడర్ కుటుంబం వుంది. ఆగస్టు నెల 25వ తేదీ రాత్రి పనిని ముగించుకుని ఇంటికొచ్చి ఒలెగ్జాండర్.. దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో పోలీసులకు షాకిచ్చే.. గగుర్పాటు కలిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన ఒలెగ్జాండర్ భార్య మరియా వద్ద పోలీసులు విచారణ జరిపారు. భర్త కొన్నేళ్ల పాటు తనను చిత్రహింసలకు గురిచేశాడని.. ఆ తంతు ఏమాత్రం తగ్గలేదని.. తానూ మనిషినేనని.. సహనం కోల్పోవడంతో భర్తను చంపేశానని చెప్పుకొచ్చింది. 
 
అందుకే పని ముగించుకుని ఇంటికొచ్చి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి చంపేసానని.. అయినా తన ఆవేశం తగ్గకపోవడంతో అతని మర్మాంగాన్ని కత్తిరించి బయట నిల్చున్న కుక్కలకు విసిరేశానని చెప్పింది. 
 
ఆ సమయంలో చేతిలో రక్తపు మరకలతో కనిపించిన మరియాను తాము చూసినట్లు స్థానికులు తెలిపారు. అంతేగాకుండా ప్రతిరోజూ మరియాను ఆమె భర్త తీవ్రంగా హింసించేవాడని.. దీన్ని కూడా చూశామని స్థానికులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఇక ఈ కేసులో మరియా నిందితురాలని తేలితే 15 సంవత్సరాలు జైలు శిక్ష తప్పదని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం