Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...

Advertiesment
మరిదితో అక్రమ సంబంధం అంటగట్టారనీ...
, గురువారం, 5 సెప్టెంబరు 2019 (18:09 IST)
అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. కాలనీకి చెందిన రాజేష్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రాజేష్‌కు శ్రీదేవికి గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈనేపధ్యంలో ఈ నెల 31న పాఠశాలలో ఉన్న తన ఇద్దరు కుమారులు దీక్షిత్, యశ్వంత్‌లను తీసుకుని వెళ్లిపోయింది.
 
అప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పిల్లలిద్దరూ కాలనీ సమీపంలోని కుంటలో శవమై తేలారు. వీరు మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయి. పిల్లల పుస్తకాలు కూడా అక్కడే పడి ఉన్నాయి. మృతదేహాలు భరించలేని దుర్వాస వస్తున్నాయి. 
 
అయితే శ్రీదేవికి మరిదితో అక్రమ సంబంధం ఉందని బంధువులు నిలదీయంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శ్రీదేవితో పాటు పిల్లలు మృతి చెందడం స్థానికంగా విషాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌గా మార్చుతాం : సీఎం జగన్