Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టెమిస్-1 తర్వాత జరిగే ప్రయోగాలేంటి?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (14:08 IST)
NASA's Artemis
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని సోమవారం నింగిలోకి పంపిచనుంది. ఆ తర్వాత జరిగే ప్రయాగాలపై అమితాసక్తి నెలకొంది. వచ్చే 2024లో ఆర్టెమిస్-2 యాత్రను నిర్వహించనుంది. ఇందులో నలుగుర వ్యోమగాములు ఉంటారు. అయితే వారు చంద్రుడిపై కాలుమోపరు. జాబిలి ఉపరితలానిక 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రుడిని చుట్టి వస్తారు. ఆ యాత్ర విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించి అత్యంత ఎక్కువ దూరం ఇదే అవుతుంది. 
 
ఆ తర్వాత 2025లో ఆర్టెమిస్‌-3 యాత్రకు శ్రీకారం చుడుతారు. ఆ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతారు. ఇందుకోసం ఒరాయన్‌.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకపై ఆధారపడనుంది.
 
ఒరాయన్‌ తొలుత చంద్రుడి కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమవుతుంది. అప్పుడు ఒరాయన్‌లోని వ్యోమగాములు ఆ వ్యోమనౌకలోకి ప్రవేశిస్తారు. భూ కక్ష్యలోని 'డిపో' నుంచి స్టార్‌షిప్‌నకు ఇంధనం అందుతుంది.
 
ఆ తర్వాత దశలో 'గేట్‌వే' పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని నాసా ఏర్పాటు చేస్తుంది. జాబిలి ఉపరితలానికి చేరుకోవడానికి ముందు వ్యోమగాములు ఇందులో బస చేస్తారు. సుదూర అంతరిక్ష యాత్రలకూ దీన్ని విడిది కేంద్రంగా ఉపయోగించుకుంటారు. 
 
అయితే అపోలోకు, ఒరాయన్‌కు ఉన్న తేడాలను నిశితంగా పరిశీలిస్తే, అపోలో ముగ్గురు ఆస్ట్రోనట్స్‌ను 13 రోజుల యాత్రకు తీసుకెళ్లగలదు. కానీ, ఒరాయన్‌.. నలుగురు వ్యోమగాములను 21 రోజుల యాత్రకు తరలించగలదు.
 
అపోలో క్రూ మాడ్యుల్‌ వ్యాసం 12.8 అడుగులు కాగా, ఒరయాన్ వెడల్పు 16.5 అడుగులు. అపోలో ఆరు అడుగులు కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులను తీసుకెళుతుంది. ఒరయాన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్త్రీపురుషులను తీసుకెళుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments