దేశంలో కొత్తగా మరో 8 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (12:59 IST)
దేశంలో కొత్తకా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేరళ వెల్లడించిన 15 మరణాలతో సహా గడిచిన 24 గంటల్లో 45 మరణాలు రికార్డయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 7,591 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 9 వేలకుపైనే ఉంది. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. 
 
పాజిటివిటీ రేటు మాత్రం 4.58 శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 84,931(0.19 శాతం)కి తగ్గిందని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
2020 ప్రారంభం నుంచి 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న 9,206 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరడం సానుకూలాంశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments