దేశంలో కొత్తగా మరో 8 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (12:59 IST)
దేశంలో కొత్తకా మరో 8 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేరళ వెల్లడించిన 15 మరణాలతో సహా గడిచిన 24 గంటల్లో 45 మరణాలు రికార్డయ్యాయి. 
 
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1.65 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 7,591 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఆ సంఖ్య 9 వేలకుపైనే ఉంది. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గడంతో కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. 
 
పాజిటివిటీ రేటు మాత్రం 4.58 శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 84,931(0.19 శాతం)కి తగ్గిందని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
2020 ప్రారంభం నుంచి 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న 9,206 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి చేరడం సానుకూలాంశం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !

Rashmika Mandanna: గొండ్ తెగల నేపథ్యంతో రష్మిక మందన్న మైసా పోస్టర్

Mrunal Thakur: హ్యాండ్ బ్రేక్ లేని అంబెలెన్స్ తో చాలా రిస్కీ స్టంట్స్ చేశాను : మృణాల్ ఠాకూర్

Pradeep Ranganathan: ఏఐ వల్ల ఎన్ని ఇబ్బందులో.. 2040 నాటికి పరిస్థితి ఏమౌతుందో?

ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments