అణ్వాయుధాలను ఎపుడైనా ప్రయోగిస్తాం : పాకిస్థాన్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (09:46 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చర్యను పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత్‌పై లేనిపోని నిందలు మోపుతోంది. పైగా, యుద్ధం చేస్తామంటూ భీకరాలు పలుకుతోంది. ముఖ్యంగా, యుద్ధం అనేది వస్తే భారత్‌పై తాము తొలుత అణ్వాయుధాలను ప్రయోగించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 
 
ఆయన అలా వ్యాఖ్యానించి రెండు రోజులు కూడా కాకముందే ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ పరస్పర విరుద్ధ ప్రకటన చేశారు. అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదన్న నియమమేమీ తమ వద్ద లేదన్నారు. అణ్వాయుధాలను తామైతే తొలుత ప్రయోగించబోమన్న భారత రక్షణ మంత్రి రాజ్‌సింగ్ వ్యాఖ్యలపై గఫూర్ మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 
 
'అణ్వాయుధాలను తొలుత ప్రయోగించబోమన్న రూల్సేమీ మేము పెట్టుకోలేదు' అని గఫూర్ స్పష్టం చేశారు. దాడి అనేది మొదలైతే ఒకదాని వెంట మరొకటి జరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అణ్వస్త్ర దేశాలకు యుద్ధం కోసం ప్రత్యేకంగా ఓ స్థలం ఉండదని గఫూర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments