Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య శ్రీదేవితో బోనీకపూర్... అచ్చుగుద్దినట్టుగానే అతిలోకసుందరి మైనపు బొమ్మ

భార్య శ్రీదేవితో బోనీకపూర్... అచ్చుగుద్దినట్టుగానే అతిలోకసుందరి మైనపు బొమ్మ
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (12:48 IST)
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మైనపు బొమ్మ సిద్ధమైంది. దివంగత నటి శ్రీదేవికి నివాళిగా దీన్ని తయారు చేశారు. ప్రతిష్టాక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ బుధవారం సింగ‌పూర్‌లో శ్రీదేవి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించింది. ఈ కార్య‌క్ర‌మానికి శ్రీదేవి భ‌ర్త బోని క‌పూర్, ఆమె కూతుళ్ళు జాన్వీ క‌పూర్‌, ఖుషీ క‌పూర్ హాజ‌ర‌య్యారు. 
 
"మిస్ట‌ర్ ఇండియా" చిత్రంలోని హ‌వా హ‌వాయి సాంగ్‌లో శ్రీదేవి లుక్ మాదిరిగానే మైన‌పు విగ్ర‌హాన్ని త‌యారు చేశారు. జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లి మైన‌పు విగ్ర‌హాన్ని చూస్తూ అలా ఉండిపోయింది. శ్రీదేవి మైన‌పు విగ్ర‌హం చూపరుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.
webdunia
 
కాగా, బోనీకపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి 2018 సంవత్సరం ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ఓ నక్షత్ర హోటల్‌లోని బాత్ టబ్‌లో మునిగి కన్నుమూసిన విషయం తెల్సిందే. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించింది. ఇటీవ‌ల ఆమె జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు కుటుంబ స‌భ్యులు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#SaahoStorm నాలుగు రోజుల్లో రూ.330 కోట్ల గ్రాస్