Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (17:04 IST)
అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా లేదా మరో దేశం మద్దతు ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ పక్షాన చేరితో అది కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. 
 
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. 
 
ఈ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం గురించి అమెరికా అధ్యక్షుడు ఆలోచన చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన మార్గాలపై చర్చించేందుకు అరాఘ్చీ జెనీవాలో యూరోపియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. 
 
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు అమెరికా రహస్యంగా మద్దతు ఇస్తూ, మరోవైపు అణు ఒప్పందం చర్చలకు తమను ఆహ్వానించడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో అణు చర్చలు జరపడానికి ఇరాన్ సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments