లీడ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత క్రికెటర్ రిషభ్ పంత్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో రిషభ్ సెంచరీ బాదేశాడు. తొలి ఇన్నింగ్స్లో 359/3 స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను మొదలు పెట్టింది. 65 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన రిషభ్ పంత్ 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బషీర్ వేసిన 99.1 ఓవర్లో సిక్స్ కొట్టి టెస్టుల్లో ఏడో సెంచరీ చేశాడు.
ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా, మొదటి మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. యువ ఆటగాళ్లు గిల్ (127), జైశ్వాల్ (101)లు సెంచరీలో రాణించగా, శుభమన్ గిల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్కు వరుణ గండం పొంచివుంది. శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణం సమయంలో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ నివేదిక వెల్లడించింది.