Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లీడ్స్ టెస్ట్ మ్యాచ్ : టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు

Advertiesment
Gill

ఠాగూర్

, శుక్రవారం, 20 జూన్ 2025 (16:51 IST)
ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. లీడ్స్‌లోని  హెడింగ్లీ మైదానం ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 
 
యువ క్రికెటర్ శుభమన్ గిల్ భారత జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. దీంతో అందరి దృష్టి అతని కెప్టెన్సీపైనే ఉంది. అలాగే, ఈ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా వుంది. మరోవైపు, సొంతగడ్డపై బెన్ స్టోక్స్ సేనను తక్కువగా అంచనా వేయడానికీ వీల్లేదు. బజ్ బాల్ క్రికెట్‌తో దూకుడుగా ఆడే ఇంగ్లండ్ తనకు అనుకూల వాతావరణంలో మరింతగా రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
ఇదిలావుంటే, ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఇరు జట్ల వివరాలు..
భారత జట్టు : జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, గిల్, రిషభ్ పంత్, కరుణ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
 
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్  (కెప్టెన్), జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ షోయబ్ బషీర్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Harbhajan Singh: ఒకరోజు సీఎం అయితే హర్భజన్ సింగ్ ఏం చేస్తారో తెలుసా?