Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వతంత్ర భారత చరిత్ర, ప్రణబ్ విడదీయలేనివి: యూఎస్ సెనేట్ ఘన నివాళులు

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:29 IST)
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాలలో ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు మరవలేనిదని యూఎస్ సెనేట్ కొనియాడింది. స్వతంత్ర భారత్ చరిత్రను, ప్రణబ్‌ను విడదీయలేమని, ఇండియాలో జరిగిన అభివృద్ధి వెనుక ఆయన చేసిన కృషి ఎంతో ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రణబ్‌ను గుర్తు చేసుకున్నారు.
 
భారత ప్రజలు ఓ గొప్ప నేతను కోల్పోయారని, ప్రణబ్ ముఖర్జీ పేరు తరతరాలు వినిపిస్తుందని సెనేట్ పేర్కొంది. ప్రణబ్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో దక్షిణాసియా విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కాగా 84 ఏళ్ల వయసులో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ నిన్న సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
ప్రణబ్ ముఖర్జీ మరణం తనకు బాధ కలిగించిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడటంలో తన తండ్రి హయాంలో ప్రణబ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సంతాపాన్ని తెలుపుతూ ముఖర్జీ ఓ గొప్ప రాజకీయ యోధుడనీ అభివర్ణించారు. రష్యా ఇండియాల మధ్య స్నేహ బంధం గొప్పగా ఉందంటే అందుకు ప్రణబ్ కూడా కారణమేనని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments