చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

ఠాగూర్
బుధవారం, 15 అక్టోబరు 2025 (17:42 IST)
చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అరుదైన ఖనిజాల విషయంలో చైనా పోకడ ఏమాత్రం బాగోలేదని తప్పుబట్టింది. చైనాలో దొరికే ఈ అరుదైన ఖనిజాలపై అక్కడి ప్రభుత్వం కట్టిడి చేస్తోందని, తద్వారా ప్రపంచ దేశాలపై ఆదిపత్యం చెలాయించేందుకు చైనా యత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ధోరణిని ఏమాత్రం సహించజాలమని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనాను ఎదుర్కోవాలంటే తమకు భారత్ సహాయం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారంలో భారత్‌పై అమెరికా కన్నెర్రజేసింది. భారీగా సుంకాల భారం మోపింది. అయితే, చైనా విషయంలో మాత్రం భారత్ తమకు సాయం చేయాలని కోరడం గమనార్హం.
 
ఇదే అంశంపై స్టాక్ బెసెంట్ మాట్లాడుతూ, ప్రపంచంలో మరెక్కడా లభించని అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఇటీవల నియంత్రణ విధించిందని చెప్పారు. విదేశీ కంపెనీలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలనే షరతు విధించిందన్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష సవాలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చైనాకు, ప్రపంచ దేశాలకు మధ్య నెలకొన్న పోటీ అని ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆయన మండిపడ్డారు. బీజింగ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే భారత్, అమెరికా కలిసి పని చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments