Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 38 మిలియన్ డాలర్ల బకాయి ఉన్నాం : ఐక్యరాజ్యసమితి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:03 IST)
ఐక్యరాజ్యసమితి ఇండియాకు 38 మిలియన్ డాలర్ల బకాయి పడింది. భారత్‌లో 2019 మార్చి నెల వరకు చేపట్టిన శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన 38 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 
 
అయితే ఐక్యరాజ్యసమితి బకాయిపడ్డ దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో (38 మిలియన్ డాలర్లు) ఉండగా రువాండా (31 మిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (28 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (25 మిలియన్ డాలర్లు), నేపాల్ (23 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెక్రటరీ జనరల్ తన నివేదికలో తెలిపారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి నివేదిక తయారు చేసిన ఆయన, 2019 మార్చి 31 నాటికి ఐక్యరాజ్యసమితి వివిధ దేశాలకు 265 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.
 
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం తమ సైన్యాలు, పోలీసులను పంపి చురుకైన పాత్ర పోషించినందుకు ఆయా దేశాలకు బకాయి పడినట్లు గుటెరెస్ తెలియజేసారు. జూన్ 2019 నాటికి ఇది 588 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యు.ఎన్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments