Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు 38 మిలియన్ డాలర్ల బకాయి ఉన్నాం : ఐక్యరాజ్యసమితి

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (16:03 IST)
ఐక్యరాజ్యసమితి ఇండియాకు 38 మిలియన్ డాలర్ల బకాయి పడింది. భారత్‌లో 2019 మార్చి నెల వరకు చేపట్టిన శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం ఖర్చు చేసిన 38 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 
 
అయితే ఐక్యరాజ్యసమితి బకాయిపడ్డ దేశాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో (38 మిలియన్ డాలర్లు) ఉండగా రువాండా (31 మిలియన్ డాలర్లు), పాకిస్థాన్ (28 మిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (25 మిలియన్ డాలర్లు), నేపాల్ (23 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెక్రటరీ జనరల్ తన నివేదికలో తెలిపారు. 
 
ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి నివేదిక తయారు చేసిన ఆయన, 2019 మార్చి 31 నాటికి ఐక్యరాజ్యసమితి వివిధ దేశాలకు 265 మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉందని చెప్పారు.
 
ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షణ కార్యక్రమాల కోసం తమ సైన్యాలు, పోలీసులను పంపి చురుకైన పాత్ర పోషించినందుకు ఆయా దేశాలకు బకాయి పడినట్లు గుటెరెస్ తెలియజేసారు. జూన్ 2019 నాటికి ఇది 588 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యు.ఎన్ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments