Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ప్రధానిగా ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడుకే మొగ్గు!

Webdunia
సోమవారం, 11 జులై 2022 (09:15 IST)
బ్రిటిన్ ప్రధానమంత్రిగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కే అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకునే పనుల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీ నేతలు నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 
 
నిజానికి ప్రధానమంత్రి రేసులో తొమ్మిది మంది ఉన్నారు. విశ్వాసాన్ని తిరిగి పొంది, ఆర్థికంగా పునర్నిర్మించడానికి, దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కృషి చేస్తానని సునాక్‌ చెబుతున్నారు. పూర్తి ప్రణాళికను ఆయన ఇంకా వెల్లడించకపోయినా, పన్నుల్లో కోత గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పన్ను విషయాల్లో ఆయన్ని నమ్మలేమనీ, ఆయనొక అబద్ధాల కోరు అని వ్యక్తిగత విమర్శలూ ప్రసార మాధ్యమాల్లో మొదలయ్యాయి. 
 
పైగా, ఆయన భార్య అక్షతా మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. అయితే, సునాక్‌ వైపు ఎక్కువమంది మొగ్గు చూపిస్తుండగా వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన పెన్నీ మాడెంట్‌ ఆ తర్వాతి స్థానంలో నిలుస్తున్నారు. 9 మంది పోటీదారులకు అదనంగా విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ కూడా బరిలో దిగవచ్చని వినవస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments