Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (08:39 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పుతో గ్రామ పెద్దల సమక్షంలోనే ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ దారుణం నాగోన్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోర్​లాలుగావ్ గ్రామానికి చెందిన రంజిత్‌ బార్దోలోయ్‌ అనే వ్యక్తిపై హత్యారోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేల్చి.. అతడిని అందరి ముందే సజీవ దహనం చేశారు. అనంతరం పూడ్చిపెట్టారు.
 
ఈ ఘోరంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నన్నామని పోలీసులు తెలిపారు.
 
'బోర్​లాలుగావ్‌లో బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' అని డీఎస్పీ ఎం.డాస్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments