Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (08:39 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పుతో గ్రామ పెద్దల సమక్షంలోనే ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ దారుణం నాగోన్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోర్​లాలుగావ్ గ్రామానికి చెందిన రంజిత్‌ బార్దోలోయ్‌ అనే వ్యక్తిపై హత్యారోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేల్చి.. అతడిని అందరి ముందే సజీవ దహనం చేశారు. అనంతరం పూడ్చిపెట్టారు.
 
ఈ ఘోరంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నన్నామని పోలీసులు తెలిపారు.
 
'బోర్​లాలుగావ్‌లో బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' అని డీఎస్పీ ఎం.డాస్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments