Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (08:39 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పుతో గ్రామ పెద్దల సమక్షంలోనే ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ దారుణం నాగోన్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోర్​లాలుగావ్ గ్రామానికి చెందిన రంజిత్‌ బార్దోలోయ్‌ అనే వ్యక్తిపై హత్యారోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేల్చి.. అతడిని అందరి ముందే సజీవ దహనం చేశారు. అనంతరం పూడ్చిపెట్టారు.
 
ఈ ఘోరంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నన్నామని పోలీసులు తెలిపారు.
 
'బోర్​లాలుగావ్‌లో బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' అని డీఎస్పీ ఎం.డాస్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments