పంచాయతీ తీర్పు - గ్రామ పెద్దల సమక్షంలో వ్యక్తి సజీవదహనం

Webdunia
సోమవారం, 11 జులై 2022 (08:39 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో అమానుష ఘటన ఒకటి జరిగింది. గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పుతో గ్రామ పెద్దల సమక్షంలోనే ఓ వ్యక్తిని సజీవదహనం చేశారు. ఈ దారుణం నాగోన్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోర్​లాలుగావ్ గ్రామానికి చెందిన రంజిత్‌ బార్దోలోయ్‌ అనే వ్యక్తిపై హత్యారోపణలు ఉన్నాయి. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేల్చి.. అతడిని అందరి ముందే సజీవ దహనం చేశారు. అనంతరం పూడ్చిపెట్టారు.
 
ఈ ఘోరంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నన్నామని పోలీసులు తెలిపారు.
 
'బోర్​లాలుగావ్‌లో బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం' అని డీఎస్పీ ఎం.డాస్‌ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments