Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఘోరం.. కత్తితో వీరంగం.. కనిపించినోళ్లని పొడిచేశాడు..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (11:11 IST)
జపాన్‌లో ఘోరం జరిగింది. కనిపించిన వాళ్లను పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓ దుండగుడు. ఆపై తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద.. మంగళవారం ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో 16మంది గాయాలపాలయ్యారు. 
 
గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వున్నారు. కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో భయంతో రైలు ప్రయాణీకులు పరుగులు తీశారు. అయితే 16మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. 
 
ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 50 ఏళ్ల లోపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారితో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments