Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో ఘోరం.. కత్తితో వీరంగం.. కనిపించినోళ్లని పొడిచేశాడు..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (11:11 IST)
జపాన్‌లో ఘోరం జరిగింది. కనిపించిన వాళ్లను పొడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఓ దుండగుడు. ఆపై తనను తాను గాయపరుచుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద.. మంగళవారం ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిని కనిపించినట్లు కత్తితో పొడిచేశాడు. ఈ ఘటనలో 16మంది గాయాలపాలయ్యారు. 
 
గాయపడిన వారిలో ఎనిమిది మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వున్నారు. కత్తితో ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో భయంతో రైలు ప్రయాణీకులు పరుగులు తీశారు. అయితే 16మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. 
 
ఈ సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు 50 ఏళ్ల లోపు వుంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారితో పాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments