Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ శవాన్ని భుజంపై వేసుకుని మోసుకుంటూ వెళ్లిన తల్లి...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (10:59 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పాషాణ హృదయులుగా మారిపోయారు. ఆంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకుసైతం ఆంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో బిడ్డ శవాన్ని భుజం వేసుకుని మోసుకుంటూ వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ... తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఆ బాలుడుని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఇతర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్‌ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడింది. కానీ, వైద్యులు మాత్రం నిరాకరించారు. 
 
దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. 'నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రివారు అంబులెన్స్‌ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని' అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్‌ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. అయితే ఆ దంపతుల ఆరోపణలను ఆస్పత్రి వైద్యులు తోసిపుచ్చారు. ఆ మహిళ అసత్య అరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments