Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్రిక్తతల తగ్గింపే లక్ష్యంగా ఇండో - చైనా లెఫ్టినెంట్ జనరళ్ల భేటీ...

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (08:29 IST)
భారత భూభాగంలో ఇండో - చైనా దేశాలకు చెందిన సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్ళ స్థాయి సమావేశం జరుగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించే లక్ష్యంగా ఈ చర్చలు జరుగనున్నాయి. 
 
ఈ సమావేశం తూర్పు లడఖ్‌లోని అధీనరేఖవెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుసూల్‌లో ఇరు దేశ సైన్యాల లెఫ్టినెంట్ జనరళ్లు మంగళవారం సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణతోపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడంపైనే ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయి. 
 
అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు కూడా ఖరారు చేయనున్నారు. కాగా, ఇటీవల జరిగిన చర్చల ఫలితంగా చైనా సైన్యం గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గల్వాన్ లోయ నుంచి వెనక్కి మళ్లింది. 
 
కాగా, గత నెల 15వ తేదీన గాల్వాన్ లోయలో చైనా బలగాలు హద్దుమీరి ప్రవర్తించి భారత బలగాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 
 
కానీ, చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రాణనష్టంపై పెదవి విప్పలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చైనా బలగాలు భారత భాభాగాన్ని వదిలి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments