Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత - 20 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:57 IST)
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో 18 మంది చిన్నారులు ముగ్గురు పెద్దలతో పాటు ఏకంగా 21 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. 
 
ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 యేళ్ల యువకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయాడు. వీరిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు కూడా ఉన్నారు. 
 
మెక్సికన్ సరిహద్దుల్లో ఉవాల్డే పట్టణంలోని రోబో ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. 
 
దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిపారు. 
 
కాగా, పోలీసుల కాల్పుల్లో దండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అమెరికాలో 2018 తర్వాత ఇంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments