Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (16:09 IST)
స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీలం నదీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్ స్నేహితులతో స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు. జోరుగా ప్ర‌వ‌హిస్తున్న జీలం న‌దిని ఈదుతూ దాటితే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఫ్రెండ్స్ చెప్పడంతో.. దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. 
 
నదిలోకి దూకేందుకు ముందు స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించిన ఆ యువకుడు.. నీళ్లల్లోకి దూకిన తర్వాత ప్రవాహ ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. ఇతని మృతదేహం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అలీ తండ్రి ఫిర్యాదు మేరకు అతని స్నేహితులు ఒసామా, త‌ల్హా, జెష‌న్‌, షోయ‌బ్‌, రాహ‌త్‌ల‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments