Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు.. జీలం నదిలో కొట్టుకుపోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పో

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (16:09 IST)
స్మార్ట్ ఫోన్ కోసం పందెం కాయడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రవహిస్తున్న నదిని ఈతకొడుతూ దాటితే రూ.15వేల విలువైన స్మార్ట్ ఫోన్ కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో ఓ యువకుడు నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని జీలం నదీ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతానికి చెందిన అలీ అబ్రార్ స్నేహితులతో స్మార్ట్ ఫోన్ కోసం బెట్ కట్టాడు. జోరుగా ప్ర‌వ‌హిస్తున్న జీలం న‌దిని ఈదుతూ దాటితే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ఫ్రెండ్స్ చెప్పడంతో.. దూకి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్లో వైరల్ అవుతోంది. 
 
నదిలోకి దూకేందుకు ముందు స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించిన ఆ యువకుడు.. నీళ్లల్లోకి దూకిన తర్వాత ప్రవాహ ధాటికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. ఇతని మృతదేహం లభించలేదని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో అలీ తండ్రి ఫిర్యాదు మేరకు అతని స్నేహితులు ఒసామా, త‌ల్హా, జెష‌న్‌, షోయ‌బ్‌, రాహ‌త్‌ల‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments