Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను ఇప్పుడల్లా పార్టీ నుంచి పీకేయలేరా..? ఎన్డీయేలోకి అన్నాడీఎంకే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్త

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (15:47 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్తలు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఓపీఎస్ తన మద్దతుదారులతో కలిసి ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. 
 
ఇప్పటికే ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన తరుణంలో చిన్నమ్మను పార్టీ నుంచి తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. దినకరన్ తరహాలోనే చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించేందుకు చేసిన తీర్మానంలో ముగ్గురు మంత్రులు సంతకాలు చేయకపోవడంతో వారిని బుజ్జగించే పనులు జరుగుతున్నాయని తెలిసింది.
 
అన్నాడీఎంకే ఇరు వర్గాలు ఏకమైన తరుణంలో ఎన్డీయేలో ఆ పార్టీ కలవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్న నేపథ్యంలో ఓపీఎస్-ఈపీఎస్ సమావేశమై పార్టీని ఎన్డీయేలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీలో కలిసిన తరహాలోనే అన్నాడీఎంకే కూడా ఎన్డీయేలో కలిసిపోతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments