Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులపై బాలిక ప్రతీకారం.. ఏకే 47తో గుండ్లవర్షం.. ఇద్దరు మృతి

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:29 IST)
ఉగ్రవాదులపై ఓ ఆఫ్ఘనిస్థాన్ బాలిక ప్రతీకారం తీర్చుకుంది. తన తల్లిదండ్రులను దారుణంగా కాల్చి చంపేసిన ఉగ్రవాదులపై సాహసంగా పోరాడిన ఆ బాలిక ఉగ్రమూకలను తుపాకీతో కాల్చిపారేసింది.

ఏకే 47 తీసుకుని ఆ ఉగ్రవాదులపై గుండ్లవర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు చనిపోగా.. అనేక మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటన మధ్య ప్రావిన్స్ ఘోర్‌లోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. స్థానిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు ఉగ్రవాదులు ఆ బాలిక తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అతని భార్య ఉగ్రవాదులను ఎదురించింది. దాంతో..కోపానికి గురైన ఆ ఉగ్రవాదులు ఆ బాలిక తల్లిదండ్రులను చంపేశారు.

ఇంట్లో ఉండి ఆ ఘటనను కళ్లారా చూసిన వారి కూతురు కమర్‌గుల్‌.. అక్కడే పడివున్న ఏకే 47 తుపాకీని తీసుకుని ఉగ్రవాదులను కాల్చింది. అలాగే పక్కనే ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోగా... పలువురు గాయపడ్డారు.
 
కమర్‌గుల్‌ కాల్పులు జరిపిన విషయాన్ని స్థానిక పోలీసు హెడ్ హబీబురాహ్మాన్ మాలెక్జాడా ధ్రువీకరించారు. అయితే.. కమర్‌ సాహసాన్ని ఆప్ఘనిస్థాన్ప్రభుత్వం ప్రశంసించింది. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని.. అక్కా తమ్ముళ్లను తన భవనానికి కూడా ఆహ్వానించారు. వారికి భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments