Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్ నేతలతో చర్చలు రద్దు చేసుకున్న డోనాల్డ్ ట్రంప్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (11:11 IST)
తాలిబన్ నేతలతో జరగాల్సిన శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రద్దు చేసుకున్నారు. గురువారం కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబులో 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో జరగాల్సిన శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అఫ్ఘాన్‌ రాజధాని కాబూల్‌లో గురువారం జరిగిన ఆత్మాహుతి కారుబాంబు దాడిలో అమెరికా సైనికుడు సహా 12 మంది మరణించారు. ఈ పేలుడుకు కారణం తామేనని తాలిబన్లు ప్రకటించారు. మేరీల్యాండ్‌లోని అధ్యక్ష భవనం క్యాంప్‌ డేవిడ్‌లో అఫ్ఘాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, తాలిబన్‌ సీనియర్‌ నేతలతో ఆదివారం తాను రహస్యంగా సమావేశం కానున్నట్టు శనివారం ట్రంప్ ట్వీట్ చేశారు. 
 
అయితే, గురువారం జరిగిన కారు బాంబు పేలుడు తమపనేనని తాలిబన్ ప్రకటించడంతో ఆ భేటీని, శాంతి చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తాలిబన్లపై విరుచుకుపడ్డారు. తమ పంతం నెగ్గించుకునేందుకు, చర్చల్లో పైచేయి సాధించడం కోసం ఇలా ఎంతమందిని చంపుకుంటూ పోతారని, ఎన్ని దశాబ్దాలు పోరాడాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అర్థవంతమైన ఒప్పందం కుదరాలనే నైతిక అర్హత వారికి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments