ఇరాన్ సైనికులపై ఆత్మాహుతి దాడి.. స్కెచ్ వేసింది.. పాకిస్థానీయుడే..

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:13 IST)
పుల్వామా దాడి విషయంలో తమకే పాపం తెలియదని ఇమ్రాన్ పేర్కొన్న కొన్ని గంటల్లోనే జైషే మహ్మద్ రెండో వీడియోను విడుదల చేసింది. పుల్వామా దాడి తమ పనేనని మరోమారు స్పష్టం చేసింది.
 
పుల్వామా వంటి దాడులను తాము ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలమని జైషే ఆ వీడియోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడితో 27 మంది ఇరాన్ సైనికులను కూడా పొట్టనబెట్టుకున్న ఉగ్రవాది కూడా పాకిస్థాన్‌కు చెందిన వాడేనని ఇరాన్ ఆరోపించింది. 
 
ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా తరహాలోనే ఇరాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ సైనికులపై దాడికి పాల్పడింది పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ తేల్చేసింది. 
 
అంతేగాకుండా ఈ దాడికి స్కెచ్ వేసింది కూడా పాకిస్థాన్ జాతీయుడేనని ఇరాన్ గార్డ్స్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ మహ్మద్ పాక్‌పౌర్ తెలిపారు. తాజా ఉగ్రదాడి పాకిస్థానీయుల పనేనని తొలిసారి బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments