Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే

Webdunia
బుధవారం, 20 జులై 2022 (13:15 IST)
శ్రీలంక దేశ కొత్త అధ్యక్షుడుగా ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్న రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. బుధవారం ఆ దేశ పార్లమెంట్‌లో రణిల్ విక్రమసింఘేను కొత్త దేశాధ్యక్షుడుగా ఎన్నికున్నారు. గత 40 యేళ్ళ కాలంలో పార్లమెంట్ ద్వారా లంకాదేశ కొత్త అధ్యక్షుడుని ఎన్నుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకను వదిలి ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దొంగచాటుగా పారిపోయిన విషయం తెల్సిందే. దీంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ కొత్త అధ్యక్షుడుగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. 
 
మొత్తం 225 ఓట్ల శ్రీలంక పార్లమెంట్‍‌లో 223 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేశారు. వీరిలో రణిల్ విక్రమసింఘేకు 134 మంది మద్దతు తెలుపగా, ఈ పదవి కోసం పోటీపడిన దుల్లాస్‌కు 82, దిసనాయకేకు 3 ఓట్లు చొప్పున పోలయ్యాయి. దీంతో విక్రమసింఘే దేశ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కాగా, రణిల్ విక్రమసింఘే శ్రీలంక ప్రధానిగా ఆరు సార్లు విధులు నిర్వహించడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments