Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి : విజయసాయి రెడ్డి

vijayasai reddy
, గురువారం, 14 జులై 2022 (16:39 IST)
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు పట్టిన గతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా పడుతుందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత గొటబాయకు పట్టిన గతే చంద్రబాబు అనే గొట్టబాయికి పడుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
2024 ఎన్నికల తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు సింగపూర్‌కు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం చంద్రబాబు కొన్నేళ్ల క్రితమే సింగపూర్‌లో ఓ హోటల్‌ను కొనుగోలు చేశారన్నారు. అలాగే, ఇక్కడకు పారిపోయేందుకు ఓ ప్రైవేట్ జెట్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారని ఆరోపించారు. 
 
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేలా 2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి పడుతుందని గొట్టబాయ - గొట్టంబాబులిద్దరిదీ ఒకే మజిలీ సింగపూరేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం: విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి?