భూమిపైకి దిగుతూ పేలిపోయిన స్పేస్ ఎక్స్... కారణమేంటి?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (10:16 IST)
అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చంద్రుడు, అంగారకుడిపై ప్రయోగాలు చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఇందుకోసం ఈ సంస్థ చేపట్టిన 'స్టార్‌షిప్‌' నమూనా రాకెట్‌ పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌ తీరంలో బుధవారం చేపట్టిన ఈ ప్రయోగంలో నమూనా (ప్రోటోటైప్‌) రాకెట్‌ భూమిపై దిగేసమయంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది. ఈ మేరకు రాకెట్‌ లాంచింగ్‌, పేలిపోయిన దృశ్యాలను ట్విట్టర్‌ అధికారిక ఖాతాలో ప్రసారం చేసింది. 
 
పేలిపోవడానికి కారణమేంటి? 
అయితే, ఈ ప్రయోగంలో భాగంగా, స్టార్‌షిప్‌ నమూనా రాకెట్‌ తొలుత అనుకున్నట్టుగానే నింగిలోకి దూసుకుపోయింది. ప్రొగ్రామ్‌ ప్రకారం.. రాకెట్‌లోని మొత్తం మూడు ఇంజిన్‌లలో రెండు ఇంజిన్‌లు పనిచేయడం ఆగిపోయిన వెంటనే రాకెట్‌ నిర్ణీత ఎత్తుకు వెళ్లి.. తిరిగి భూమి మీదకు దూసుకురావడం ప్రారంభించింది. 
 
4.45 నిమిషాల అనంతరం మూడో ఇంజిన్‌ కూడా సరైన సమాయానికే ఆగిపోయింది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో దూసుకువస్తున్న రాకెట్‌ వేగాన్ని అదుపు చేయడానికి మొదటి రెండు ఇంజిన్‌లు స్టార్ట్‌ అయ్యాయి. అయితే ఊహించని విధంగా రాకెట్‌ భూమిని వేగంగా ఢీకొట్టి పేలిపోయింది. అయితే, అసలు ప్రయోగం చేపట్టడానికి కావలసిన సమాచారం లభించిందని స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.
 
ఏమిటీ ప్రయోగం? 
మార్స్‌, చంద్రుడి మీదకు మనుషులు, సామగ్రిని తీసుకుపోయి, తిరిగి తీసుకువచ్చేందుకు ‘స్పేస్‌ఎక్స్‌' సంస్థ ‘స్టార్‌షిప్‌' సిరీస్‌ పేరిట వ్యోమనౌకలను తయారు చేస్తున్నది. ఇలాంటి బృహత్తర ప్రయోగాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అందుకనే, వీటికి సంబంధించిన నమూనా రాకెట్లను అసలు ప్రయోగానికి ముందుగా పరీక్షిస్తారు. ఇందులో భాగంగానే బుధవారం ‘స్పేస్‌ఎక్స్‌' ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం